మణిపూర్‌లో ఉగ్ర దాడి, 2 పోలీసులు మృతి

- December 14, 2016 , by Maagulf
మణిపూర్‌లో ఉగ్ర దాడి, 2 పోలీసులు మృతి

మణిపూర్‌ రాష్ట్రంలోని లోక్‌చావోలో గురువారం ఉదయం ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబి సింగ్‌ కార్యక్రమానికి భద్రత నిమిత్తం సిబ్బంది మోరహ్‌ నుంచి తెంగనౌపల్‌ జిల్లాకు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు సమాచారం. పేలుడు పదార్థాలు, తుపాకీలతో ఉగ్రవాదులు దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా హైఅలర్ట్‌ను ప్రకటించారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com