ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో విశాఖ యువకుడి మృతి

- December 15, 2016 , by Maagulf
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో  విశాఖ యువకుడి మృతి

విశాఖ నగరానికి చెందిన ఓ యువకుడి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మృతిచెందాడు. నగరంలోని మురళీనగర్‌కు చెందిన అనుదీప్‌ గతేడాది ఎంఎస్‌ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. నిన్న సాయంత్రం నలుగురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లి.. అక్కడ స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతూ మృతిచెందాడు. అనుదీప్‌ మృతి సమాచారం ఈరోజు ఉదయం తల్లిదండ్రులకు అందడంతో వారు విషాదంలో ముగినిపోయారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా మృత్యువాత పడ్డాడంటూ వారు రోదిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనిపై స్పందించి అనుదీప్‌ మృతదేహం స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని బంధువులు కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com