ఆర్టీసీలో ప్రయాణికులకు శుభవార్త.!

- December 16, 2016 , by Maagulf
ఆర్టీసీలో ప్రయాణికులకు శుభవార్త.!

ప్రయాణికుల్ని ఆకర్షించిన వెనుకసీట్ల రాయితీకి ఏపీఎస్‌ఆర్టీసీ మంగళం పాడింది. బస్సుల్లో చివరి రెండు వరుస సీట్లకు టికెట్‌పై ఇస్తున్న 20 శాతం రాయితీని ఎత్తేసింది. ఇతర సీట్లలో మాదిరిగానే వీటికీ పూర్తిస్థాయి ఛార్జీ వసూలుచేస్తోంది. బస్సులో ఖాళీగా ఉంటున్న సీట్ల భర్తీకోసం ఏపీఎస్‌ఆర్టీసీ ఏప్రిల్‌లో కొత్త పథకం ప్రవేశపెట్టింది. వెనుకసీట్లలో కూర్చోవడానికి ప్రయాణికులు ఆసక్తి చూపించడం లేదని గుర్తించి.. ఆఖరి రెండు వరుసల్లో ముందస్తుగా టికెట్‌ తీసుకునేవారికి బేసిక్‌ ధరపై 20 శాతం రాయితీని ప్రకటించింది. కానీ కొద్దిరోజుల క్రితం చడీచప్పుడు లేకుండా వెనుకసీట్ల రాయితీని ఆర్టీసీ అధికారులు ఎత్తేశారు.

అన్ని సీట్లకూ ఒకే రకమైన ఛార్జీని వసూలుచేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించగా.. ఈ రాయితీని ప్రయాణికులు పెద్దగా ఉపయోగించుకోవడం లేదని.. వారి నుంచి డిమాండ్‌ లేకపోవడంతో 20 శాతం తగ్గింపును తొలగించామని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు 'ఈనాడు'తో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com