కార్తితో తమిళంలో జతకట్టనున్న రకుల్ ప్రీత్
- December 16, 2016
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్సింగ్. మహేష్బాబు, జూ॥ ఎన్టీఆర్, రాంచరణ్లతో పాటు పలువురు అగ్రహీరోలతో ఆడి పాడింది. కొన్ని నెలల క్రితం విశాల్ హీరోగా నటిస్తున్న 'తుప్పరివాలన్' చిత్రంలో నటించేందుకు దర్శకుడు సంప్రదించగా తెలుగులో బిజీగా ఉన్న కారణంతో నటించలేదు. ఈ నేపథ్యంలో ఆమె తమిళ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. విశాల్కు నో చెప్పిన ఈ పసిడిమేని ఛాయల చిన్నది కార్తి సరసన నటించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కార్తి ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలోని 'కాట్రు వెళియిడై' చిత్రంలో నటిస్తున్నారు.
ఆ తర్వాత 'చదురంగ వేట్టె' ఫేమ్ వినోద్ దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ బ్యానరుపై ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తారు. ఇందులోనే కార్తి సరసన రకుల్ను ఎంచుకున్నారు. కథ విన్న వెంటనే రకుల్ కూడా నటించేందుకు అంగీకరించిదని చెబుతున్నారు.దీంతో జనవరి నుంచి చిత్రీకరణ ఆరంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







