ఎక్సైజ్‌ శాఖకు 200 కోట్లు నష్టం: మంత్రి కొల్లు రవీంద్ర

- December 16, 2016 , by Maagulf
ఎక్సైజ్‌ శాఖకు 200 కోట్లు నష్టం: మంత్రి కొల్లు రవీంద్ర

దేశంలో పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో రూ.200 కోట్ల మేర ఎక్సైజ్‌ శాఖ ఆదాయం తగ్గిందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మద్యం దుకాణాల్లో పీవోఎస్‌ యంత్రాలు వాడాలని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటికే 20శాతం లావాదేవీలు డిజిటల్‌ రూపంలో జరుగుతున్నాయన్నారు. హైవే పక్కన ఉన్న మద్యం దుకాణాలను 500మీ.ల దూరంలో ఏర్పాటుచేయాలని ఆదేశించినట్టు చెప్పారు. వారం రోజుల్లోగా కొత్త బార్‌ విధానం తీసుకురానున్నట్టు ప్రకటించారు. వెనుకబడిన తరగతుల్లో వివిధ సమాఖ్యలకు రూ.354 కోట్లు రుణాలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com