ఖాతిఫ్లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన జడ్జి
- December 16, 2016
జెడ్డా: ఈస్టర్న్ ప్రావిన్స్ సెక్యూరిటీ అథారిటీస్, అనుమానాస్పదంగా అదృశ్యమైన ఖాతిఫ్ - ఎండోవ్మెంట్స్ అండ్ ఇన్హెరిటెన్స్ డిపార్ట్మెంట్ జడ్జ్ షేక్ మొహమ్మద్ అల్ జిరానీ వ్యవహారంపై విచారణ జరుపుతున్నాయి. టారుట్ ఐలాండ్లోని తన ఇంటి నుంచి షేక్ మొహమ్మద్ అదృశ్యమైనట్లుగా భావిస్తున్నారు. ప్రాథమికంగా జడ్జిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఇంతవరకు అధికారికంగా సెక్యూరిటీ ఫోర్సెస్ జడ్జి అదృశ్యంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అధికార ప్రతినిథి మన్సూర్ అల్ ఖఫారి మాట్లాడుతూ మినిస్టర్ ఆఫ్ జస్టిస్, సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ అదిపతి వాలిద్ అల్ సమాని ఈ ఘటనను జాగ్రత్తగా ఫాలో అవుతున్నట్లు చెప్పారు. ఈ కేసుని డీల్ చేయగల శక్తి సెక్యూరిటీ ఫోర్సెస్కి ఉందని ఆయన చెప్పారు. షేక్ అల్ జిరానీ ఆస్తులపై గతంలో పలుమార్లు గుర్తు తెలియని వ్యక్తుల కారణంగా దాడులు జరిగాయి. ఆయన ఇంటిని తగలబెట్టే ప్రయత్నం కూడా చేశారు. 2012 అక్టోబర్లో అల్ రుబైయాలోని ఆయన ఇంట్లోకి చొరబడేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు కూడా. ఈ ఘటనలో షేక్ అల్ జిరానీ కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









