షార్జాలో ఇండియన్ స్కూల్ లో 12 వేలమంది విద్యార్థులు
- December 16, 2016
ఎమిరేట్ లో అతిపెద్ద భారత కమ్యూనిటీ పాఠశాల, రానున్న విద్యా సంవత్సరం షార్జాలో ఇండియన్ స్కూల్ యొక్క ఒక కొత్త శాఖను తెరవడం కోసం సిద్ధమయ్యంది.. 44.3 మిలియన్ డి హెచ్ వ్యయంతో పాఠశాలను అధికారికంగా దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పునరాయి విజయన్, డిసెంబర్ 22 వ తేదీన ప్రారంభించనున్నారు. అయిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత యుఎఇ కి మొట్టమొదటిసారిగా పర్యటన చేయనున్నారు. ఈ కొత్త పాఠశాల షార్జ లోని రోజా సమీపంలో జువైజ్ ప్రాంతంలో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ స్థలంను సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షార్జా పాలకుడు శ్రీశ్రీ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖ్అసిమి దానంగా ఈ పాఠశాలకు ఇచ్చారు. ఈ పాఠశాల నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ షార్జ (ఐఎఎస్), అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,బాలికలకు ఒక పాఠశాలలు అని బాలలకు మరొకటి విడివిడిగా నిర్మించారు.ఐఏఎస్ అధ్యక్షుడు " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, కొత్త పాఠశాల ప్రాజెక్ట్ గత ఒకటిన్నర సంవత్సరాలు జరుగుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..









