జ్లీబ్ లో 286 మందిని అరెస్ట్ చేసిన భద్రతా సిబ్బంది
- December 16, 2016
జ్లీబ్ అల్ షుయూఖ్ ప్రాంతంలో ఆధునాతన భద్రతా ప్రచారంలో భాగంగా, 286 వ్యక్తులను వివిధ ఉల్లంఘనల కింద అరెస్టు చేశారు. ఈ ప్రచారంను ఆంతరంగిక మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ సులైమాన్ అల్ ఫాహ్డ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీ ప్రచారం నిర్వహించారు. భద్రతా పురుషులు సిబ్బంది అన్ని ప్రాంతాలు, వీధులు మరియు రహదారులు మూసి తనిఖీలు నిర్వహించగా క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న ఇరువురు వ్యక్తులను అరెస్టు చేశారు. అలాగే సివిల్ కేసులకు సంబంధించి 20 మందిని అదుపులోనికి తీసుకొన్నారు. అదేవిధంగా వారి స్పాన్సర్లు నుంచి తప్పించుకొని పరారీలో ఉన్న 12 మంది దొరికినట్లు నివేదించబడింది.మరో 185 మందికి తమ పౌర గుర్తింపు కార్డు లేనందున , అదేవిధంగా 49 మందికి వారి వీసాల గడువు ముగియడంతో అరెస్ట్ చేశారు. అలాగే, అక్రమంగా అనుమతులు లేకుండా దేశంలోకి ప్రవేశించి మద్యం అమ్మకాలలో భాగస్వయులైన 9 మందిని అరెస్ట్ చేశారు. దీనితోపాటు 200 మందిని ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులలో అరెస్ట్ చేశారు. వీరిలో అక్రమ 35 వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకొన్నారు. 45 మంది తమ వాహన నెంబర్ ప్లేట్ల ను తొలగించిన నేరంకు అరెస్ట్ చేసి ఆ వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. తనిఖీ సమయంలో వారి వారి పత్రాలు అధికారులకు చూపిన తర్వాత 3500 మందిని విడుదల చేశారు మోయి ఇటువంటి ఇంటెన్సివ్ ప్రచారాలు దేశంలో పలుమార్లు భద్రత నిర్వహించడానికి కొనసాగుతుందని ధ్రువీకరించాయి.
తాజా వార్తలు
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..









