జ్లీబ్ లో 286 మందిని అరెస్ట్ చేసిన భద్రతా సిబ్బంది
- December 16, 2016
జ్లీబ్ అల్ షుయూఖ్ ప్రాంతంలో ఆధునాతన భద్రతా ప్రచారంలో భాగంగా, 286 వ్యక్తులను వివిధ ఉల్లంఘనల కింద అరెస్టు చేశారు. ఈ ప్రచారంను ఆంతరంగిక మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ సులైమాన్ అల్ ఫాహ్డ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీ ప్రచారం నిర్వహించారు. భద్రతా పురుషులు సిబ్బంది అన్ని ప్రాంతాలు, వీధులు మరియు రహదారులు మూసి తనిఖీలు నిర్వహించగా క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న ఇరువురు వ్యక్తులను అరెస్టు చేశారు. అలాగే సివిల్ కేసులకు సంబంధించి 20 మందిని అదుపులోనికి తీసుకొన్నారు. అదేవిధంగా వారి స్పాన్సర్లు నుంచి తప్పించుకొని పరారీలో ఉన్న 12 మంది దొరికినట్లు నివేదించబడింది.మరో 185 మందికి తమ పౌర గుర్తింపు కార్డు లేనందున , అదేవిధంగా 49 మందికి వారి వీసాల గడువు ముగియడంతో అరెస్ట్ చేశారు. అలాగే, అక్రమంగా అనుమతులు లేకుండా దేశంలోకి ప్రవేశించి మద్యం అమ్మకాలలో భాగస్వయులైన 9 మందిని అరెస్ట్ చేశారు. దీనితోపాటు 200 మందిని ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులలో అరెస్ట్ చేశారు. వీరిలో అక్రమ 35 వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకొన్నారు. 45 మంది తమ వాహన నెంబర్ ప్లేట్ల ను తొలగించిన నేరంకు అరెస్ట్ చేసి ఆ వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. తనిఖీ సమయంలో వారి వారి పత్రాలు అధికారులకు చూపిన తర్వాత 3500 మందిని విడుదల చేశారు మోయి ఇటువంటి ఇంటెన్సివ్ ప్రచారాలు దేశంలో పలుమార్లు భద్రత నిర్వహించడానికి కొనసాగుతుందని ధ్రువీకరించాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







