వేలిముద్ర సాయంతో విమానాశ్రయాల్లోకి ప్రవేశించొచ్చు
- December 17, 2016
విమాన ప్రయాణికులకు మరో శుభవార్త. ఇప్పటి వరకు విమానాశ్రయంలోకి ప్రవేశించాలంటే టికెట్తో పాటు సంబంధిత గుర్తింపు పత్రాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి అవి మర్చిపోతే ఇక అంతేసంగతులు. ఇకపై ఇటువంటి బాధలకు స్వస్తి పలకనుంది విమానయాన శాఖ. ఇకపై ఎటువంటి పత్రాలూ లేకుండా కేవలం వేలిముద్ర సాయంతో విమానాశ్రయాల్లోకి ప్రవేశించొచ్చు. ఈ విధానం అమలుపై విమానయాన శాఖ అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే దీన్ని హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.ఇప్పటి వరకు దేశంలో 100 కోట్ల మందికి ఆధార్ కార్డులను జారీ చేశారు. ఆ సమయంలో వేలిముద్రలతో పాటు, ఐరిస్ స్కాన్స్ను తీసుకున్నారు. వాటిని ఇప్పటికే నేషనల్ డిజిటల్ రిజిస్ట్రీకి పంపారు. అయితే, ఇకపై విమాన టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఆధార్ వివరాలను నమోదు చేసుకుంటారు. దీంతో విమానాశ్రయాల్లో కేవలం వేలిముద్ర వేయడం ద్వారా లోపలికి ప్రవేశించే వీలుంటుంది. అయితే దేశీయ విమానాల్లో ప్రయాణించేందుకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, విదేశీ విమనాల్లో ప్రయాణించాలంటే పాస్పోర్టు తప్పనిసరిగా కలిగి ఉండాలని విమానయానశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.హైదరాబాద్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇస్తుండడంతో రానున్న రోజుల్లో దిల్లీ, ముంబయి, బెంగళూరు విమానాశ్రయాల్లో అమలు చేయనున్నట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గురుప్రసాద్ మహాపాత్ర తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు







