జెడ్డా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభం
- December 17, 2016
జెడ్డా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభం
జెడ్డా: మక్కా గవర్నర్ మరియు కింగ్ సల్మాన్ అడ్వయిజర్ ప్రిన్స్ ఖాలెద్ అల్ ఫైసల్ గురువారం 2వ జెడ్డా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ని ప్రారంభించారు. జెడ్డా గవర్నర్ ప్రిన్స్ మిషాల్ బిన్ మాజిద్, మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ అదెల్ అల్ తరోయిఫి పలువురు ప్రిన్స్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాంఛనంగా బుక్ ఫెయిర్ని ప్రారంభించిన అనంతరం ప్రిన్స్ ఖాలెద్, పెవిలియన్స్ని సందర్శించారు. మొత్తం 45 స్థానిక, జిసిసి, అరబ్ మరియు ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ హౌస్లు 30 దేశాల నుంచి ఇక్కడ పాల్గొంటున్నాయి. ఈ ఈవెంట్ని స్పాన్సర్ చేస్తున్న అలాగే మద్దతిస్తున్న వారిని ప్రిన్స్ సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ మిషాల్, ప్రిన్స్ ఖాలెద్ని ప్రశంసించారు. జెడ్డాలో కల్చరల్ మెగా ఈవెంట్ని స్పాన్సరింగ్ చేస్తుండడం చాలా గొప్ప విషయమన్నారు. బుక్ ఫెయిర్ నిర్వహణ ద్వారా పుస్తక పఠనంపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతుందనీ, పుస్తక పఠనం ద్వారా సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకోవడంతోపాటు, సమాజం పట్ల అవగాహన పెంచుకోడానికి వీలవుతుందని, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని తెలుసుకోగలుగుతారని ప్రిన్స్ మిషాల్ చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బుక్ ఫెయిర్ తెరిచి ఉంటుంది. సుమారు 70,000 మంది ఈ బుక్ ఫెయిర్కి వస్తారని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







