13 మంది సైనికుల మృతి
- December 17, 2016
బాంబు పేలుళ్లతో టర్కీ మరోసారి ఉలిక్కిపడింది. టర్కీ సైనిక సిబ్బందిని తీసుకువెళ్తున్న బస్సును పేలుడు పదార్థాలు ఉన్న కారు ఢీ కొట్టడంతో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 48 మంది గాయపడినట్లు టర్కీ సైన్యం వెల్లడించింది. క్యాసేరిలోని ఎరసైయెస్ యూనివర్సిటీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి బస్సు పూర్తిగా ధ్వంసమైంది. సైనికులను తీసుకెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొనే ఈ కారు బాంబు దాడికి పాల్పడినట్లు టర్కీ ఉప ప్రధాని వెసి క్యానక్ తెలిపారు. దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.గత వారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో కుర్దిష్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి జరిగిన వారం వ్యవధిలోనే మరో దాడి జరగడం గమనార్హం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







