యెమన్ ఆపరేషన్ లో మరణించిన 45 ఎమిరేట్ సైనికులు

- September 05, 2015 , by Maagulf
యెమన్ ఆపరేషన్ లో మరణించిన 45 ఎమిరేట్ సైనికులు

తిరుగుబాటుదారులను అణచివేయడానికి యెమన్ లో మోహరించిన సౌదీ నేతృత్వంలోని సేనలలో 45 మంది అనుకోకుండా జరిగిన ప్రేలుడులో  మరణించినట్టు యూ. ఏ. ఈ. ప్రకటించింది. మరీబ్ ప్రావిన్స్ లో జరిగిన ఈ ఘటనలో 23 మంది గాయపడ్డ సైనికులు మరణించడంతో, మృతుల సంఖ్య 22 నుండి 45కి పెరిగింది. అరబ్ పార్లమెంట్ స్పీకర్ అహ్మెద్ మొహ్యామెడ్ అల్ జర్వాన్ - 'ఆపరేషన్ రెస్టోర్ హోప్' లో విధులు నిర్వహిస్తూ మరణించిన మృతవీరులు అరబ్ మరియు ఇస్లామీయ చరిత్రలో తమ పేర్లను శాశ్వతంగా నిలుపుకున్నారని నివాళులర్పించారు. ఆయన అరబ్ ప్రజల తరపున సానుభూతిని, సంతాపాన్ని -  అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు తెలియజేశారు.


--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com