బాగా చెమటలు పట్టిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది....
- September 05, 2015
ఫ్యాన్, కూలర్స్ , ఏసిల కింద కూర్చొని చెమట పట్టనివ్వకుండా ఉన్నాసరే ఏదో తెలియని విసుగు ఉంటుంది. కాస్త పనిచేయగానే ఒత్తిడిగా ఫీలవుతారు. సహజసిద్ధంగా చేసే శారీరక శ్రమతో శరీరంలోని టాక్సిన్స్ వ్యర్థపదార్థాలు, మలినాలు అన్నీ చర్మందాటి బయటికి రావడానికి అవకాశముంటుంది. దాంతో చర్మ రంధ్రాలన్నీ తెరుచుకుని జిడ్డు, మురికి బయటికి వచ్చేస్తాయి. ముఖ్యంగా కొంత మన శరీరం అలసినప్పుడు చెమట పడితే, రెండవది వాతావరణం పరిస్థితుల ప్రభావం వల్ల చెమట పడుతుంది. అయితే చెమటపట్టకుండా జాగ్రత్తపడటం వలన కూడా అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్యనిపుణులు. జిమ్, వ్యాయామాలు చేసి ఎంత అలసిసొలసి పనిచేస్తారో, ఏమేరకు చెమటలు పడతాయో అంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి శరీరంలో చెమటలు పట్టించడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దాం... చెమటలు పట్టించడం వల్ల గుండె మరింత వేగంగా పనిచేస్తుంది. శరీరంలో రక్తప్రసరణ మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ ప్రొసెస్ లో శరీరంలో పుట్టే వేడి వల్ల శరీరం మరింత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. శరీరంలో చెమట ఎంత ఎక్కువగా పడితే అంత ఎక్కువ చర్మం శుభ్రపడుతుంది. దాంతో చర్మం మరింత ఆరోగ్యంగా, మాయిశ్చరైజర్ గా కనబడుతుంది. చెమట వల్ల శరీరంలో అదనపు నీరు కోల్పోవచ్చు మరియు అందువల్ల మరిన్ని ఎక్కువ నీరు త్రాగాలి. రోజులో ఎంత ఎక్కువ నీరు తీసుకుంటే కిడ్నీలకు అంత మంచిది. శరీరం ఎక్కువగా చెమట పట్టించడం ద్వారా మీ శరీరం నుండి టాక్సిన్స్ ను తొలగించుకోవచ్చు. వ్యాయామం లేదా జిమ్ వల్ల శరీరంలో చెమటలు పట్టిండ ద్వారా శరీరంలో కొన్ని మంచి కెమికల్స్ విడుదలవుతాయి. దాంతో మనస్సు ప్రశాంత పడుతుంది. చెమట వల్ల శరీరంలో యాంటీ బయోటిక్స్ చేరి జీవక్రియలకు అంతరాయం కలిగిస్తాయి. కాంట్టి, వాటిని నుండి రక్షణ కల్పించి మైక్రోఆర్గానిజమ్ చాలా ఎఫిషియంట్ గా పనిచేస్తుంది. చెమట పట్టడం వల్ల శరీరంలో గాయాలు మానుతాయని రీసెంట్ ఒక పరిశోధన ద్వారా తెలపడం జరిగినది చెమట పట్టడం మరియు వ్యాధినిరోధకత మద్య సంబంధం ఉన్నది. అందువల్లే ఆరోగ్య నిపుణులు చెమటలు పట్టించమని చెబుతుంటారు. వ్యామాలు, జిమ్ లను చేయమని సలహాలిస్తుంటారు. శరీరంలో చెమటలు పట్టడం వల్ల వేడి పుట్టి, జీవక్రియలు మరింత వేగంగా పనిచేస్తాయి . రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
తాజా వార్తలు
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!









