డిశ్చార్జి కానున్నారు సుష్మాస్వరాజ్!
- December 19, 2016
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. ఈ నెల 10న ఆమెకు ఇక్కడి ఎయిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవడంతో ఆమెను డిశ్చార్జి చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
20ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న సుష్మాస్వరాజ్ నవంబర్ 7న కిడ్నీ విఫలమవడంతో ఎయిమ్స్లో చేరారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా ఆమె ట్వీట్ల ద్వారా కొందరికి సహాయపడిన సంగతి తెలిసిందే. ఆదివారం కూడా ఓ మహిళ అభ్యర్థనను మన్నించి ఆమె భర్త మృతదేహాన్ని జపాన్ నుంచి స్వదేశం తెప్పించేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ మేరకు ఆస్పత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. వినూత్న రీతిలో ట్విట్టర్ డిప్లొమసీ ద్వారా పనులు సాధిస్తున్న సుష్మను ఇటీవలే ఫారెన్ పాలసీ మ్యాగజైన్ గ్లోబల్ థింకర్స్ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







