డిశ్చార్జి కానున్నారు సుష్మాస్వరాజ్‌!

- December 19, 2016 , by Maagulf
డిశ్చార్జి కానున్నారు  సుష్మాస్వరాజ్‌!

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. ఈ నెల 10న ఆమెకు ఇక్కడి ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవడంతో ఆమెను డిశ్చార్జి చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
20ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న సుష్మాస్వరాజ్‌ నవంబర్‌ 7న కిడ్నీ విఫలమవడంతో ఎయిమ్స్‌లో చేరారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా ఆమె ట్వీట్ల ద్వారా కొందరికి సహాయపడిన సంగతి తెలిసిందే. ఆదివారం కూడా ఓ మహిళ అభ్యర్థనను మన్నించి ఆమె భర్త మృతదేహాన్ని జపాన్‌ నుంచి స్వదేశం తెప్పించేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ మేరకు ఆస్పత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. వినూత్న రీతిలో ట్విట్టర్‌ డిప్లొమసీ ద్వారా పనులు సాధిస్తున్న సుష్మను ఇటీవలే ఫారెన్‌ పాలసీ మ్యాగజైన్‌ గ్లోబల్‌ థింకర్స్‌ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com