డిశ్చార్జి కానున్నారు సుష్మాస్వరాజ్!
- December 19, 2016
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. ఈ నెల 10న ఆమెకు ఇక్కడి ఎయిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవడంతో ఆమెను డిశ్చార్జి చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
20ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న సుష్మాస్వరాజ్ నవంబర్ 7న కిడ్నీ విఫలమవడంతో ఎయిమ్స్లో చేరారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా ఆమె ట్వీట్ల ద్వారా కొందరికి సహాయపడిన సంగతి తెలిసిందే. ఆదివారం కూడా ఓ మహిళ అభ్యర్థనను మన్నించి ఆమె భర్త మృతదేహాన్ని జపాన్ నుంచి స్వదేశం తెప్పించేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ మేరకు ఆస్పత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. వినూత్న రీతిలో ట్విట్టర్ డిప్లొమసీ ద్వారా పనులు సాధిస్తున్న సుష్మను ఇటీవలే ఫారెన్ పాలసీ మ్యాగజైన్ గ్లోబల్ థింకర్స్ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్









