రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.!
- December 19, 2016
రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. అన్ని రైళ్లలో ఆర్ఏసీ కోటాను పెంచాలని నిర్ణయించింది. జనవరి 16 నుంచి అన్ని రైళ్లలో అదనపు ఆర్ఏసీ కోటాను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. ఆర్ఏసీ విభాగంలో ప్రయాణించేవారి సంఖ్యను పెంచుతూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో స్లీపర్ కోచ్లో ఐదు సైడ్లోయర్ బెర్తుల్లో పది మందికి, మూడో తరగతి ఏసీ కోచ్లో రెండు సైడ్ లోయర్ బెర్తుల్లో ఇద్దరిని, రెండో తరగతి ఏసీ కోచ్లో లోయర్ బెర్తులో మరో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతించేవారు. తాజాగా ఆ సంఖ్యను పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
స్లీపర్ కోచ్, మూడో తరగతి ఏసీలో మరో రెండు లోయర్ బెర్తుల్లో ఆర్ఏసీ ప్రయాణికులు ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. రెండో తరగతి ఏసీలో మరో లోయర్ బెర్తును ఆర్ఏసీ విభాగంలోకి చేర్చింది. గతంలో స్లీపర్, రెండో తరగతి, మూడో తరగతి ఏసీల్లో ఆర్ఏసీ కింద 18 మంది ప్రయాణించే వీలువుండగా, ప్రస్తుత నిర్ణయంతో అదనంగా మరో 10మంది ఆర్ఏసీ ప్రయాణికులకు ప్రయోజనం దక్కనుంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









