40 కేజీల బంగారం పట్టివేత
- December 19, 2016
ఓ ఎగుమతి దారుడి నుంచి ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 40 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువు దాదాపు పన్నెండు కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో బడా బాబుల వద్ద ఉన్న నల్లధనాన్ని బంగారంగా మార్చే చర్యల్లో భాగంగానే అతడు ఇంత పెద్ద బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. నోయిడాలోని స్పెషల్ ఎకనామిక్ జోన్(ఎన్ఎస్ఈజెడ్) నుంచి ఇతడు దేశీయ మార్కెట్ కు బంగారం పంపిణీ దారుడిగా పనిచేస్తున్నాడు.
దుబాయి నుంచి ఎన్ఎస్ఈజెడ్ ఆభరణాలు తయారు చేసి విక్రయించేందుకు గాను బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.
అనంతరం అదే ఆభరణాలను దుబాయ్ కు ఎగుమతి చేస్తుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పటికే దేశీయ మార్కెట్లోకి దాదాపు రూ.150 కోట్ల విలువైన బంగారం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ బంగారాన్నంత కొంతమంతి బడా బాబుల వద్ద ఉన్న అక్రమ సంపాదనను తెల్లడబ్బుగా మార్చేందుకు ఉపయోగించినట్లు సమాచారం. బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లి అనంతరం రిమాండ్ కు తరలించారు.
మరోపక్క, మీరట్ లో ఓ ప్రభుత్వ సంస్థలో ఇంజినీర్ గా పనిచేస్తున్న ఆర్ కే జైన్ అనే వ్యక్తి వద్ద నుంచి ఐటీ అధికారులు రూ.2.67కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 17 లక్షలు కొత్త కరెన్సీ ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







