అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు అధునాతన సాంకేతికత..
- December 20, 2016
అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు సిద్ధంచేసిన ఓ అధునాతన సాంకేతికతను త్వరలో జపాన్ పరీక్షించనుంది. దీని ద్వారా ఖగోళ వ్యర్థాలను సేకరించి, ధ్వంసంచేసే అవకాశముంది. దీనిలో ఎలక్ట్రోడైనమిక్ టెథర్ (ఈడీటీ)గా పిలిచే 700 మీ పొడవైన సాధనముంది. దీన్ని ఓ వ్యోమనౌక అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. వ్యర్థాలు ఎక్కడున్నాయో కూడా చూపిస్తుంది. దీంతో వ్యర్థాలకు ఈడీటీ దగ్గరగా వెళ్లి, వాటిని గట్టిగా పట్టుకుంటుంది. అనంతరం వ్యర్థాలతో సహా ఈడీటీని వ్యోమనౌక భూ ఉపరితలం మీదకు తీసుకొస్తుంది. చివరగా వ్యర్థాలను ధ్వంసంచేస్తుంది.
ముఖ్యంగా వందల కేజీల బరువుండే భారీ అంతరిక్ష వ్యర్థాలను దీని సాయంతో తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు జపాన్ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. ఈ సాంకేతికతలో జీపీఎస్ ద్వారా వ్యర్థాలను గుర్తిస్తామని స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









