అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు అధునాతన సాంకేతికత..
- December 20, 2016
అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు సిద్ధంచేసిన ఓ అధునాతన సాంకేతికతను త్వరలో జపాన్ పరీక్షించనుంది. దీని ద్వారా ఖగోళ వ్యర్థాలను సేకరించి, ధ్వంసంచేసే అవకాశముంది. దీనిలో ఎలక్ట్రోడైనమిక్ టెథర్ (ఈడీటీ)గా పిలిచే 700 మీ పొడవైన సాధనముంది. దీన్ని ఓ వ్యోమనౌక అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. వ్యర్థాలు ఎక్కడున్నాయో కూడా చూపిస్తుంది. దీంతో వ్యర్థాలకు ఈడీటీ దగ్గరగా వెళ్లి, వాటిని గట్టిగా పట్టుకుంటుంది. అనంతరం వ్యర్థాలతో సహా ఈడీటీని వ్యోమనౌక భూ ఉపరితలం మీదకు తీసుకొస్తుంది. చివరగా వ్యర్థాలను ధ్వంసంచేస్తుంది.
ముఖ్యంగా వందల కేజీల బరువుండే భారీ అంతరిక్ష వ్యర్థాలను దీని సాయంతో తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు జపాన్ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. ఈ సాంకేతికతలో జీపీఎస్ ద్వారా వ్యర్థాలను గుర్తిస్తామని స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









