300 కొత్త పథకాలు ఆవిష్కరించిన యూపీ సీఎం..
- December 20, 2016
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వరుసపెట్టి ప్రాజెక్టులు, పథకాలు ప్రారంభిస్తున్నారు. మంగళవారం కేవలం నాలుగు గంటల్లోనే ఆయన దాదాపు 300 కొత్త పథకాలు ఆవిష్కరించారు. ఐటీ ప్రాంగణం మొదలుకొని, ఆసుపత్రులు, గృహ నిర్మాణం, విద్యా సంస్థల ఏర్పాటు, స్విమ్మింగ్పూల్లు, రహదారుల నిర్మాణం తదితర ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసుకుంటూ పోయారు. వీటి మొత్తం విలువ రూ.50,000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. త్వరలో ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదలచేయనుంది.
అనంతరం ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుంది. ఈ లోగానే ప్రాజెక్టులన్నీ ఆవిష్కరించేయాలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







