తేలియాడుతున్న మంచు గడ్డపై పియానో ప్రదర్శన!
- December 21, 2016
ఇటలీకి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు లుడోవికో ఇనోది, ఆర్కిటిక్ సముద్రంలో ఇచ్చిన ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సంగీత ప్రియులు అతని అద్భుత బాణీలకు మంత్రముగ్ధులైతే.. పర్యావరణవేత్తలను ఈ ప్రదర్శన ఆలోచనలో పడేసింది. ప్రదర్శనలో అంతర్లీనంగా మానవాళికి ముంచుకొస్తున్న ముప్పు గురించి చెప్పాడు ఇనోది. ఆర్కిటిక్ మహాసముద్రంలో తేలియాడుతున్న మంచు గడ్డపై పియానో వాయిస్తూ ఇచ్చిన ప్రదర్శనకు మంచి స్పందన వస్తోంది. ఆర్కిటిక్కు స్మృతిగీతం పేరుతో ఈ ప్రదర్శన సాగింది. ఇనోది ప్రత్యేకంగా దీనికోసమే ఈ ట్యూన్ను కంపోజ్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్ను గ్రీన్పీస్ సంస్థ స్పాన్సర్ చేసింది. ప్రపంచ నేతలూ ఆర్కిటిక్ వైపు ఓసారి చూడంటూ ఈ ప్రదర్శన ద్వారా పిలుపునిచ్చారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఊహించిన దానికన్నా వేగంగా ఆర్కిటిక్ కరిగిపోతోందని, ఇప్పటికైనా మేల్కోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఇచ్చారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







