12 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది..
- December 21, 2016
తమిళనాడుకు చెందిన 12 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారనే కారణంతో శ్రీలంక నేవీ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పనీర్సెల్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి.. తమిళ జాలర్ల విషయంలో శ్రీలంక నేవీ అనుసరిస్తున్న విధానానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరిన మరుసటి రోజే ఈ అరెస్టులు చోటు చేసుకోవడం గమనార్హం. రామేశ్వరం ఫిషరీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గోపీనాధ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పంబన్ నుంచి మూడు బోట్లలో 20 మంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. నిషేధించిన వలలతో చేపల వేటకు వెళ్లిన వీరిని, శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకోనే సమయంలో ఒక బోట్లో ఎనిమిది మంది అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేశారు. మిగిలిన రెండు బోట్లలోని 12 మందిని శ్రీలంక అధికారులు అదుపులోకి తీసుకొని కంగేసంతురాయ్ పోర్ట్కు తరలించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







