శరవేగంగా దోహా మెట్రో పనులు
- December 21, 2016
దోహా మెట్రో ప్రాజెక్ట్ 54 నుంచి 59 శాతం మేర పనులు పూర్తయ్యాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. నాఉలగు లేన్లలో పనులు పూర్తవడం గొప్ప విషయమని ఆయన అన్నారు. 2019 చివరి క్వార్టర్లో తొలి మెట్రో ట్రైన్ పరుగులు పెట్టడం ఖాయమని ఖతార్ ఇంటిగ్రేటెడ్ రైల్వే ప్రాజెక్ట్ సీనియర్ డైరెక్టర్ మార్కస్ డెమ్మిలెర్ చెప్పారు. ఖతార్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో 13.6 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ స్ట్రెచ్లో61.4 శాతం పనులు పూర్తయ్యాయనీ, 8.9 కిలోమీటర్ల సౌత్ ఎలివేటెడ్ రూట్లో 66.5 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. లుసైల్ లైట్ రైల్ ట్రాన్సిట్కి సంబంధించి 32 కిలోమీటర్ల మేర 35 స్టేషన్లతో రూపొందిస్తున్న ప్రాజెక్ట్ పనులు మాత్రం కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయి. 44.8 శాతం పనులు ఇప్పటిదాకా పూర్తయ్యాయి. లుసైల్ ఎల్ఆర్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 2020 నాటికి అందుబాటులోకి వస్తుంది. 2022 ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి సరిగ్గా రెండేళ్ల ముందు ఈ ప్రాజెక్ట్ని అందుబాటులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. సౌదీ అరేబియాతో కనెక్ట్ అయ్యే 486 కిలోమీటర్ల ప్రాజెక్ట్ని ఎంతో పట్టుదలతో పూర్తి చేయగలమని కూడా ఖతార్ రైల్ అధికారులు చెప్పారు. ఖతార్ రైల్ అధికారులు, ఖతార్ మెట్రోకి సంబంధించిన పూర్తి వివరాల్ని గణాంకాలతో సహా వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







