'మిక్చర్‌ పొట్లం' నిర్మాత లయన్ డా.లక్ష్మీ ప్రసాద్ తో మాగల్ఫ్ ముచ్చట్లు

- December 21, 2016 , by Maagulf

విభిన్న కథాంశాలతో రూపొందే చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. తెలుగు తెరపై కొత్త ప్రయత్నాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు లభిస్తూనే ఉంటాయి. ఆ పెద్ద మనసుతోనే తమ చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు 'మిక్చర్‌ పొట్లం' నిర్మాత లక్ష్మీ ప్రసాద్‌. సరదా సరదాగా సాగే చక్కని కథాంశంతో 'మిక్చర్‌ పొట్లం' సినిమా రూపొందుతోందని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఈ చిత్రాన్ని నిర్మించామని మాగల్ఫ్‌ శ్రీకాంత్ తో లక్ష్మీ ప్రసాద్‌ సినిమా విశేషాల్ని వివరించారు. 'కొత్త బంగారు లోకం' ఫేం శ్వేతా బసు ప్రసాద్‌ ఈ చిత్రంలో నటిస్తుండడం గొప్ప విషయం. జయంత్‌, గీతాంజలి, భానుచందర్‌, సుమన్‌, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్‌, చిట్టిబాబు, అలీ, జూనియర్‌ రేలంగి, వీరన్న చౌదరి, జబర్‌దస్త్‌ మురళి, జబర్‌దస్త్‌ ఫణి తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. మాధవపెద్ది సురేష్‌ సంగీతం అందించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎంవి సతీష్‌ కుమార్‌,నిర్మాతలు:లయన్ డా. కలపటపు శ్రీ లక్ష్మీ ప్రసాద్, డా.కంటే వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనొవాసరావు. గోదావరి సినీ టోన్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com