'మిక్చర్ పొట్లం' నిర్మాత లయన్ డా.లక్ష్మీ ప్రసాద్ తో మాగల్ఫ్ ముచ్చట్లు
- December 21, 2016
విభిన్న కథాంశాలతో రూపొందే చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. తెలుగు తెరపై కొత్త ప్రయత్నాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు లభిస్తూనే ఉంటాయి. ఆ పెద్ద మనసుతోనే తమ చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు 'మిక్చర్ పొట్లం' నిర్మాత లక్ష్మీ ప్రసాద్. సరదా సరదాగా సాగే చక్కని కథాంశంతో 'మిక్చర్ పొట్లం' సినిమా రూపొందుతోందని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఈ చిత్రాన్ని నిర్మించామని మాగల్ఫ్ శ్రీకాంత్ తో లక్ష్మీ ప్రసాద్ సినిమా విశేషాల్ని వివరించారు. 'కొత్త బంగారు లోకం' ఫేం శ్వేతా బసు ప్రసాద్ ఈ చిత్రంలో నటిస్తుండడం గొప్ప విషయం. జయంత్, గీతాంజలి, భానుచందర్, సుమన్, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్, చిట్టిబాబు, అలీ, జూనియర్ రేలంగి, వీరన్న చౌదరి, జబర్దస్త్ మురళి, జబర్దస్త్ ఫణి తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. మాధవపెద్ది సురేష్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే,దర్శకత్వం: ఎంవి సతీష్ కుమార్,నిర్మాతలు:లయన్ డా. కలపటపు శ్రీ లక్ష్మీ ప్రసాద్, డా.కంటే వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనొవాసరావు. గోదావరి సినీ టోన్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







