నైజీరియాలో బస్సు ప్రమాదం 11 మంది మృతి

- December 21, 2016 , by Maagulf
నైజీరియాలో బస్సు ప్రమాదం 11 మంది మృతి

చిన్నారులపైకి ఓ బస్సు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 11 మంది పిల్లలు మృతి చెందగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ విషాదం నైజీరియాలో జరిగింది. మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ముస్లిం చిన్నారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంతలో ఓ బస్సు వారిపైకి దూసుకెళ్ళడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతి చెందిన చిన్నారులంతా 11 నుంచి 15 ఏళ్ళవారే. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ఆ దేశ పోలీసులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com