గో ఎయిర్ 'క్రిస్మస్ క్యాంపెయిన్' ఆఫర్లు
- December 21, 2016
క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్ల సందడి మొదలైంది. వరుసగా విమానయానసంస్థలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా డొమెస్టిక్ క్యారియర్ గో ఎయిర్ వినియోగదారులకు తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. "క్రిస్మస్ క్యాంపెయిన్'' ఆఫర్ లో భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది. 23 సెక్టార్స్ లో సేవలు అందిస్తున్న గో ఎయిర్ తన ఎంటైర్ నెట్వర్కులో పరిమిత కాలానికి రూ.999 లనుంచి ప్రారంభ ధరలను బుధవారం ప్రకటించింది. ఈరోజు (21 డిసెంబర్) నుంచి డిసెంబర్ 1 వరకు ఈ తగ్గింపుధరల టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
"క్రిస్మస్ క్యాంపెయిన్'' ఆఫర్ లో అన్ని చార్జీలు కలుపుకొని ఈ తగ్గింపు ధరల్ని ఆఫర్ చేస్తోంది.ఇలా బుక్ చేసుకున్న టికెట్ల తో జనవరి 9 నుంయి ఏప్రిల్ 15, 2017 ప్రయాణ అవకాశం కల్పిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 999 ఆఫర్ ప్రత్యేకంగా గోఎయిర్ నెట్ వర్క్స్ (గోఎయిర్ వెబ్సైట్, గో ఎయిర్ టికెట్ కౌంటర్లు, గోఎయిర్ కాల్ సెంటర్ మరియు ట్రావెల్ ఏజెంట్లు) అంతటా అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. పరిమితమై సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







