గుర్తింపు కార్డు ఉంటేనే వెంకన్న దర్శనం
- December 21, 2016
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ గుర్తింపు కార్డును తప్పనిసరి చేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. భక్తులకు తితిదే అందిస్తున్న సేవల్లో పారదర్శకత పెంచడంతో పాటు, అక్రమాలను అడ్డుకోవడానికి ఇప్పటికే గదుల బుకింగ్, శ్రీవారి అర్జిత సేవలతో పాటు దర్శనం టిక్కెట్లు, అంగప్రదక్షిణం టోకెన్ల జారీ, శ్రీవారి సేవకుల నమోదు కోసం ఆధార్కార్డును స్వీకరిస్తున్నారు. తాజాగా ఇదే విధానాన్ని కాలినడక భక్తులకు కూడా అమలు చేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో తిరుమలకు చేరుకునే యాత్రికులకు గాలిగోపురం వద్ద, శ్రీవారిమెట్టు మార్గంలో వచ్చే వారికి 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తారు.
ఇకపై భక్తుడి ఫోటోతో పాటు గుర్తింపుకార్డు నంబరును పొందుపరిచి దర్శనం టిక్కెట్లు జారీ చేయనున్నారు. గుర్తింపు కార్డు నంబరు పొందుపరిచిన యాత్రికులకు మాత్రమే లడ్డూ టోకెన్లు, శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వీలవుతుందని.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని భక్తులను తితిదే కోరింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









