ఎంఇసి రూలింగ్‌తో ఖతార్‌ వాహన యజమానులకు మేలు..

- December 22, 2016 , by Maagulf
ఎంఇసి రూలింగ్‌తో ఖతార్‌ వాహన యజమానులకు మేలు..

ఏదన్నా వాహనం థర్డ్‌ పార్టీ వర్క్‌ షాప్‌లో రిపేర్లు చేయించుకున్నాసరే, వారెంటీ వర్తించేలా మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ కామర్స్‌ (ఎంఇసి) చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భాల్లో ఆయా పార్ట్స్‌కి సంబంధించి మాత్రం వారెంటీ పనిచేయదు. ఈ విధానం ద్వారా వాహన యజమానులకు ఊరట లభిస్తుందని, తమ వాహనాల్ని రిపేర్‌ చేయించుకునే విషయంలో వాహనదారులకు వెసులుబాటు కలుగుతుందని, తద్వారా రిపేర్‌ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంటుందని, అలాగే వర్క్‌షాప్‌లు కూడా బాధ్యతాయుతంగా పనిచేయడానికి వీలుంటుందని ఎంఇసి పేర్కొంది. వాహన యజమానులు థర్డ్‌ పార్టీ వర్క్‌ షాప్‌లలో చేయించుకున్న రిపేర్లకు సంబంధించి పూర్తి వివరాల్ని, వాటికి సంబంధించిన పత్రాల్ని తమతో ఉంచుకోవడం మేలని ఎంఇసి సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com