ఈ-మెయిల్ అడ్రస్ ఇక తెలుగులోనే!
- December 22, 2016
న్యూదిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్, జయపురకు చెందిన డేటామెయిల్తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'డిజిటల్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ రూపొందించుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.
ఈ మేరకు డేటామెయిల్తో ఒప్పందం చేసుకుంది.
'దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చాలన్నది ప్రధాని మోదీ ఆశయం. ఇందులో భాగంగా ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ను బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు రూపొందించుకోవచ్చు. ఇక నుంచి వారు తమ మాతృభాష, ప్రాధాన్యం ఉన్న భాషలో ఈ-మెయిల్ అడ్రస్ను సృష్టించుకోవచ్చు' అని బీఎస్ఎన్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ ఓ ప్రకటనలో తెలిపారు.
మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ-మెయిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్టోర్లలో డేటా మెయిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ సదుపాయాన్ని పొందవచ్చు. హిందీ, గుజరాతీ, ఉర్దూ, పంజాబీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ రూపొందించుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ (వినియోగదారుల సేవలు)ఎన్కే గుప్తా తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







