500 మిలియన్ల దిర్హామ్స్ విలువగల మాదక ద్రవ్యాలను పట్టుకున్న దుబాయ్ కస్టమ్స్
- September 06, 2015
దుబాయ్, జెబెల్ అలీ ఏర్ పోర్టులో 140 పెట్టెలలో దాచిన 35 మిలియన్ల ట్రమడోల్ మాత్రలను, 100 బారళ్ల లోపల సంచులలో ఉన్న 2.5 టన్నుల ట్రమడోల్ పొడిని యూ. ఏ. ఈ. నుండి ఒక ఏషియా దేశానికి తరలించే యత్నాన్ని దుబాయ్ కస్టమ్స్ శాఖ వారు భగ్నం చేశారు. వీటి విలువ 500 మిలియన్ల దిర్హామ్స్ ఉంటుందని తెలియవచ్చింది. సంబంధిత దిగుమతుల కంపెనీ ఏజెంటును, తదుపరి విచారణ కొరకు దుబాయి పోలీసు వారికి అప్పగించారు. ధృవపత్రాల ప్రకారం, ఆ సరుకులో వైద్య సంబంధ ఉత్పత్తులు, సామగ్రి ఉన్నాయని తెలుపబడింది. దిగుమతిదారు గతంలో కూడా, దుబాయి కార్గో విలేజ్ ద్వారా ట్రమడోల్ ను తరలించడానికి ప్రయత్నించారని, వారి నేరచరిత్ర ప్రకారం అనుమానించి సోదా జరిపినపుడు ఈ నిషేధిత పదార్ధాలు పట్టుబడ్దాయని కస్టమ్స్ ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ డైరక్టర్ - తలాల్ అల్ అబ్దూలి వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







