500 మిలియన్ల దిర్హామ్స్ విలువగల మాదక ద్రవ్యాలను పట్టుకున్న దుబాయ్ కస్టమ్స్

- September 06, 2015 , by Maagulf
500 మిలియన్ల దిర్హామ్స్ విలువగల మాదక ద్రవ్యాలను పట్టుకున్న దుబాయ్ కస్టమ్స్

దుబాయ్, జెబెల్ అలీ ఏర్ పోర్టులో 140 పెట్టెలలో దాచిన 35 మిలియన్ల ట్రమడోల్ మాత్రలను, 100 బారళ్ల లోపల సంచులలో ఉన్న 2.5 టన్నుల ట్రమడోల్ పొడిని యూ. ఏ. ఈ. నుండి ఒక ఏషియా దేశానికి తరలించే యత్నాన్ని దుబాయ్ కస్టమ్స్ శాఖ వారు భగ్నం చేశారు. వీటి విలువ 500 మిలియన్ల దిర్హామ్స్ ఉంటుందని తెలియవచ్చింది. సంబంధిత దిగుమతుల కంపెనీ ఏజెంటును, తదుపరి విచారణ కొరకు దుబాయి పోలీసు వారికి అప్పగించారు. ధృవపత్రాల ప్రకారం, ఆ సరుకులో వైద్య సంబంధ ఉత్పత్తులు, సామగ్రి ఉన్నాయని తెలుపబడింది. దిగుమతిదారు గతంలో కూడా, దుబాయి కార్గో విలేజ్ ద్వారా ట్రమడోల్ ను తరలించడానికి ప్రయత్నించారని, వారి నేరచరిత్ర ప్రకారం అనుమానించి సోదా జరిపినపుడు ఈ నిషేధిత పదార్ధాలు పట్టుబడ్దాయని కస్టమ్స్ ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్ డైరక్టర్ - తలాల్ అల్ అబ్దూలి వివరించారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com