డ్రైవింగ్ లైసెన్స్ ఇకపై ఈజీ కాదు
- September 06, 2015
ఐడీటీఎస్ ద్వారా పరీక్ష..కొత్తగా స్మార్ట్ ట్రాక్లువచ్చే నెలనుంచి అందుబాటులోకి
డ్రైవింగ్ లైసెన్సు పొందడం ఇకపై అంత తేలికేం కాదు. ఇప్పటివరకు తూ తూమంత్రంగా నడిపినా వచ్చినా కూడా ఈజీగానే లైసెన్సు వచ్చేసేది. ఇకపై మాత్రం అలా కాదు. వాహనం నడిపేవారి సామర్థ్యాన్ని పూర్తిగా పరీక్షించే సాంకేతిక పరిజ్ఞానం రవాణా శాఖకు అందుబాటులోకి రానుంది. ‘ఇన్నోవేటివ్ డ్రైవింగ్ టెస్టింగ్ సిస్టం (ఐడీటీఎస్)’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ పరిఙ్ఞానాన్ని తెలంగాణ రవాణా శాఖ వచ్చే నెలనుంచి రాష్ట్రంలోని వివిధ డ్రైవింగ్ ట్రాక్ల్లో ప్రవేశపెట్టనుంది. మూడు రోజుల క్రితం తెలంగాణ రవాణాశాఖ అధికారులు.. పుణే ఐడీటీఆర్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్నైనింగ్ అండ్ రీసెర్చ్)ను సందర్శించి వచ్చారు. ఈ విధానంలో డ్రైవింగ్ ట్రాక్లపై రెండు వైపులా సెన్సార్లను ఏర్పాటు చేస్తారు. డ్రైవర్ వాహనం నడుపుతున్నప్పుడు.. ఏ మాత్రం తేడా వచ్చినా ఈ సెన్సార్లు పసిగడతాయి. స్మార్ట్ ట్రాక్లుగా వ్యవహరిస్తారించే ఈ ట్రాక్లపై.. మొత్తం డ్రైవింగ్ ప్రక్రియను టూడీలో వీడియో కెమెరాల ద్వారా రికార్డు చేస్తారు. సెన్సార్లు, కెమెరాల ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి సామర్ధ్యాన్ని బట్టి ఆటోమేటిక్గా మార్కులు పడతాయి. ఈ మార్కులను బట్టే డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వాలో, వద్దో నిర్ణయిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







