నందమూరివారి పంచెకట్టు ఫంక్షన్...

- December 24, 2016 , by Maagulf
నందమూరివారి పంచెకట్టు ఫంక్షన్...

తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేళంగికి పండగ కళ వచ్చింది. నందమూరి వారసులు కుటుంబసమేతంగా తరలివచ్చారు. నందమూరి హరికృష్ణ, హీరోలు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు రావడంతో అక్కడ సందడే సందడి. హరికృష్ణ కుమారుడు దివంగత జానకీరామ్ కుమారులు తారకరామారావు(13), సౌమిత్రి ప్రభాకర్‌రావు(11)లకు పంచెకట్టు ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. వేళంగిలో హరికృష్ణ వియ్యంకుడు యార్లగడ్డ ప్రభాకర్‌రావు ఉంటున్నారు. జానకీరామ్ బావమరిది అయిన యార్లగడ్డ కార్తీక్ నందమూరి వారసులకు పంచెకట్టు వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. పంచకట్టు ఫంక్షన్ కోసం పిల్లలిద్దరూ వేళంగిలోనే ఉన్నారు. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన తాతయ్య నందమూరి హరికృష్ణ, బాబాయ్‌లు కళ్యాణ్‌రామ్, జూ.ఎన్టీఆర్‌లను చూడగానే వారిద్దరూ పరుగున వెళ్లి ఆలింగనం చేసుకున్నారు.

వారి ఆప్యాయతను చూడగానే అక్కడున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి. చిన్నారులిద్దరికీ పట్టుబట్టలు అందజేసి ఆశీర్వదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com