నానబెట్టిన బాదం పప్పుల్ని తింటే..
- December 24, 2016
బాదం పప్పుల్ని అలాగే తీసుకునే కంటే రాత్రి పూట నానబెట్టి ఉదయం పూట తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చివాటితో పోలిస్తే నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల వృద్ధాప్యఛాయలు తగ్గుతాయని వారు సూచిస్తున్నారు.
బాదంలో పీచు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం ద్వారా.. వాటిని నానబెట్టి తీసుకుంటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. మోనోశాచురేటెడ్ కొవ్వే ఇందుకు కారణం. బరువు తగ్గాలనుకునేవారికి మంచి పోషకాహారమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇక.. నానబెట్టిన బాదం తినేముందు తప్పకుండా వాటి పొట్టు తీయాలి. ఉదయం పూట ఇవి తింటే గనుక బాదంలోని ఎంజైములు జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి. జీర్ణవ్యవస్థ పని తీరును వృద్ధిచేసి ఉదర సంబంధిత సమస్యలు బాధించవు. రక్తపోటు అధికంగా ఉన్నవారు కూడా నానబెట్టిన బాదం పప్పుల్ని తీసుకోవచ్చు.
ఇందులోని పోషకాలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువుకు ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా అందుతుంది. బిడ్డ ఎదుగుదలలో లోపాలు తలెత్తవు. తల్లీబిడ్డలకు ఇది మేలు చేస్తుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









