బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు మరో గౌరవ డాక్టరేట్
- December 24, 2016
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ఉర్దూ భాషా అభివృద్ధికి ఎంతోగానో కృషి చేసిన సంజయ్ సరఫ్ లకు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ నెల 26న(సోమవారం) హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా షారుక్ ఖాన్, సంజయ్ సరఫ్ లు డాక్టరేట్ తీసుకోనున్నారు. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో వర్సీటీ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బ్రిటన్లోని బెడ్ఫోర్ట్షైర్, ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయాల నుంచి షారుఖ్ఖాన్ గౌరవ డాక్టరేట్ లభించిన విషయం తెలిసిందే. గత కొనేళ్లుగా షారుఖ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు, సినిమాల్లో అతని నటనకుగానూ ఈ గుర్తింపు లభించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









