మార్చ్ లో రానున్న కాటమరాయుడు

- December 25, 2016 , by Maagulf
మార్చ్ లో రానున్న కాటమరాయుడు

పవన్‌ కళ్యాణ్‌, శ్రుతిహాసన్‌ జంటగా కిషోర్‌ పార్థసాని దర్శకత్వంలో నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. చిత్ర యూనిట్‌ పొల్లాచ్చిలో షూటింగ్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. 'గబ్బర్‌ సింగ్‌' ఘనవిజయం తర్వాత పవన్‌ కళ్యాణ్‌, శ్రుతిహాసన్‌ల కాంబినేషన్‌ మరోసారి కనువిందు చేయబోతుంది. పొల్లాచ్చిలో పవన్‌, శ్రుతిలపై చిత్రీకరించిన సన్నివేశాలు, ఒక పాట చాలా అద్భుతంగా వచ్చాయి' అని అన్నారు. 'పవన్‌ కళ్యాణ్‌తో రెండోవ సినిమా చేయడం ఆనందంగా ఉంది. మిగిలిన షూటింగ్‌ పార్ట్‌ జనవరి, ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం.

సినిమాను వచ్చే ఏడాది మార్చిలో ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం' అని దర్శకుడు తెలిపారు. అలీ, నాజర్‌, రావురమేష్‌, అజరు, నర్రా శ్రీను, పృథ్వీ, శివబాలాజీ, కమల్‌ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్‌ అరోరా, ప్రదీప్‌ రావత్‌, పవిత్ర లోకేష్‌, రజిత, యామిని భాస్కర్‌, అస్మిత, రమాదేవి, భానుశ్రీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com