మదర్ హౌస్పై దాడులకు ఐసిస్ కుట్ర
- December 25, 2016
దేశంలో పర్యటించే విదేశీ పర్యాటకులను ఐసిస్ టార్గెట్ చేసింది. ఐసిస్ అనుమానిత ఉగ్రవాది అబూ మూసా కోల్ కతాలోని మదర్ హౌస్ ను టార్గెట్ చేసినట్టు ఎన్ఐఏకు సమాచారం అందింది. సిరియాలో ఐసిస్ దళాలపై జరుగుతున్న బాంబు దాడులకు ప్రతీకారంగా ఇతడు హౌస్ కు వచ్చే అమెరికా, బ్రిటిష్, రష్యా పర్యాటకులను లక్ష్యం ఎఫ్ బీ ఐ సమాచారం ఇచ్చింది. గతంలో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిదీన్ కార్యకర్త అయిన మహ్మద్ మాసిద్దీన్ అలియాస్ మూసాను కోల్ కతాలో ఎఫ్ బీ ఐ ప్రశ్నించింది. సిరియాలో ఉన్న సుల్తాన్ అబ్దుల్ ఖదీర్ ఆర్మర్ తో కలిసి అమెరికా ఆస్తులపై దాడి చేసేందుకు అతడు కుట్ర పన్నాడనే అనుమానాలతో ఎఫ్ బీ ఐ దర్యాప్తు జరిపింది. ఆర్మర్ ఉత్తర కర్ణాటకలోని భత్కల్ వాసి. బుర్ద్వాన్ బాంబు పేలుళ్ల కేసులో మసీయుద్దీన్ ను జులైలో ఎన్ఐఏ, వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు కలిసిపట్టుకున్నారు. -
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









