మదర్ హౌస్‌పై దాడులకు ఐసిస్ కుట్ర

- December 25, 2016 , by Maagulf
మదర్ హౌస్‌పై దాడులకు ఐసిస్ కుట్ర

దేశంలో పర్యటించే విదేశీ పర్యాటకులను ఐసిస్ టార్గెట్ చేసింది. ఐసిస్ అనుమానిత ఉగ్రవాది అబూ మూసా కోల్ కతాలోని మదర్ హౌస్ ను టార్గెట్  చేసినట్టు ఎన్ఐఏకు సమాచారం అందింది. సిరియాలో ఐసిస్ దళాలపై జరుగుతున్న బాంబు దాడులకు ప్రతీకారంగా ఇతడు హౌస్ కు వచ్చే అమెరికా, బ్రిటిష్, రష్యా పర్యాటకులను లక్ష్యం ఎఫ్ బీ ఐ సమాచారం ఇచ్చింది. గతంలో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిదీన్ కార్యకర్త అయిన మహ్మద్ మాసిద్దీన్ అలియాస్ మూసాను కోల్ కతాలో ఎఫ్ బీ ఐ ప్రశ్నించింది. సిరియాలో ఉన్న సుల్తాన్ అబ్దుల్ ఖదీర్ ఆర్మర్ తో కలిసి అమెరికా ఆస్తులపై దాడి చేసేందుకు అతడు కుట్ర పన్నాడనే అనుమానాలతో ఎఫ్ బీ ఐ దర్యాప్తు జరిపింది. ఆర్మర్ ఉత్తర కర్ణాటకలోని భత్కల్ వాసి. బుర్ద్వాన్ బాంబు పేలుళ్ల కేసులో మసీయుద్దీన్ ను జులైలో ఎన్ఐఏ, వెస్ట్  బెంగాల్ సీఐడీ పోలీసులు కలిసిపట్టుకున్నారు. - 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com