అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంకు గిన్నిస్ బుక్ఆఫ్ రికార్డు
- December 25, 2016
సిలికానాంధ్ర, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం గిన్నిస్ బుక్ఆఫ్ రికార్డుకెక్కింది. ఈ సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కూచిపూడి నృత్యానికి పుట్టినిల్లయిన 'కూచిపూడి' గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని కళాకారులు ముందుకెళ్లాలన్నారు. కూచిపూడి నృత్యప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకెక్కడం గర్వకారణమన్నారు. ప్రపంచంలో అత్యున్నతమైన నాట్యాల్లో కూచిపూడి ఒకటిగా నిలుస్తుందన్నారు. కూచిపూడి నృత్యానికి గతంలో రూ.100కోట్లు కేటాయించినట్లు చెప్పారు.ప్రతి ఇంట్లో ఒక కంప్యూటర్తో పాటు కూచిపూడి నృత్యం నేర్చుకున్న కళాకారులు ఉండాలని, అందుకు తగిన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు కూచిపూడి నృత్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. సిద్దేంధ్రయోగి హైస్కూల్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.
రూ.12వేల గౌరవ వేతనంతో అన్ని పాఠశాలల్లో నాట్య గురువులను నియమించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయడు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, నారా లోకేశ్, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









