అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంకు గిన్నిస్ బుక్ఆఫ్ రికార్డు
- December 25, 2016
సిలికానాంధ్ర, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం గిన్నిస్ బుక్ఆఫ్ రికార్డుకెక్కింది. ఈ సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కూచిపూడి నృత్యానికి పుట్టినిల్లయిన 'కూచిపూడి' గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని కళాకారులు ముందుకెళ్లాలన్నారు. కూచిపూడి నృత్యప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకెక్కడం గర్వకారణమన్నారు. ప్రపంచంలో అత్యున్నతమైన నాట్యాల్లో కూచిపూడి ఒకటిగా నిలుస్తుందన్నారు. కూచిపూడి నృత్యానికి గతంలో రూ.100కోట్లు కేటాయించినట్లు చెప్పారు.ప్రతి ఇంట్లో ఒక కంప్యూటర్తో పాటు కూచిపూడి నృత్యం నేర్చుకున్న కళాకారులు ఉండాలని, అందుకు తగిన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు కూచిపూడి నృత్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. సిద్దేంధ్రయోగి హైస్కూల్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.
రూ.12వేల గౌరవ వేతనంతో అన్ని పాఠశాలల్లో నాట్య గురువులను నియమించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయడు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, నారా లోకేశ్, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







