ఖస్ఖస్ ఆలూ
- December 25, 2016
కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి- మూడు బంగాళా దుంపలు ( తొక్క తీసి పెద్ద ముక్కలుగా తరిగి)- ఆరు, పసుపు- అరటీస్పూను, కొత్తిమీర తరుగు- పావు కప్పు, ఎండు మిర్చి- మూడు, గసగసాలు- రెండు టేబుల్స్పూన్లు, నూనె- మూడు టేబుల్స్పూన్లు, నీళ్లు- అరకప్పు, ఉప్పు- తగినంత
తయారీ విధానం: గసగసాలని రెండు నిమిషాలపాటు వేగించుకొని పచ్చిమిర్చి, కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పాన్లో నూనె పోసి వేడైన తరువాత బంగాళా దుంపల ముక్కలు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో లేదా వేరొక పాన్లో నూనె వేడి చేసి ఎండు మిర్చి, పసుపు వేసి కొద్దిగా వేగించాలి. దానిలో గసగసాల పేస్టు వేసి తక్కువ మంటపై నూనె పైకి తేలే వరకు లేదా ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. ఆ తరువాత బంగాళా దుంపలు, ఉప్పు వేసి పావుగంట పాటు కలుపుతూ ఉండాలి. బంగాళా దుంపలు ఉడికిన తరువాత స్టవ్ ఆపేయాలి. దీన్ని వేడి వేడిగా పూరీల్లో తింటే చాలా టేసీగా ఉంటుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









