ఖస్ఖస్ ఆలూ
- December 25, 2016
కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి- మూడు బంగాళా దుంపలు ( తొక్క తీసి పెద్ద ముక్కలుగా తరిగి)- ఆరు, పసుపు- అరటీస్పూను, కొత్తిమీర తరుగు- పావు కప్పు, ఎండు మిర్చి- మూడు, గసగసాలు- రెండు టేబుల్స్పూన్లు, నూనె- మూడు టేబుల్స్పూన్లు, నీళ్లు- అరకప్పు, ఉప్పు- తగినంత
తయారీ విధానం: గసగసాలని రెండు నిమిషాలపాటు వేగించుకొని పచ్చిమిర్చి, కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పాన్లో నూనె పోసి వేడైన తరువాత బంగాళా దుంపల ముక్కలు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో లేదా వేరొక పాన్లో నూనె వేడి చేసి ఎండు మిర్చి, పసుపు వేసి కొద్దిగా వేగించాలి. దానిలో గసగసాల పేస్టు వేసి తక్కువ మంటపై నూనె పైకి తేలే వరకు లేదా ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. ఆ తరువాత బంగాళా దుంపలు, ఉప్పు వేసి పావుగంట పాటు కలుపుతూ ఉండాలి. బంగాళా దుంపలు ఉడికిన తరువాత స్టవ్ ఆపేయాలి. దీన్ని వేడి వేడిగా పూరీల్లో తింటే చాలా టేసీగా ఉంటుంది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









