శీతాకాలంలో పుదీనా ఆకులతో టీతో మేలెంత..? గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి?
- December 25, 2016
శీతాకాలంలో వేడివేడి టీ తాగాలనుకుంటున్నారా? ఎప్పుడూ ఒకేలా పాలతో చేసిన టీని సేవిస్తే సరిపోదని.. అందుకే టీలోనూ వెరైటీని ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. అప్పుడే శరీరానికి చురుకుదనం చేకూరుతుందని వారు సూచిస్తున్నారు. శరీరం ఏమాత్రం చురుగ్గా లేకుండా, మందకొడిగా ఉన్నప్పుడు తప్పకుండా గ్రీన్ టీ తీసుకోవాలి. శీతాకాలంలో జీవక్రియల వేగం పడిపోయినప్పుడు గ్రీన్ టీని సేవించడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.
శీతాకాలంలో నిద్రలేకపోతే ఆ ప్రభావం మరుసటి రోజు కూడా పడుతూ ఏ పనిచేయలేకపోతున్నప్పుడు చామంతిపూల టీని తాగాలి. ఇక ఒత్తిడికి లెమన్ టీ దివ్యౌషధం. ఒత్తిడి వేధిస్తున్నప్పుడు నిమ్మ టీ తాగడం వల్ల మేలు జరుగుతుంది. ఒత్తిడి కలిగించే ఆలోచనలు తగ్గుతాయి. నిమ్మ పరిమళంలోని సుగుణాలు మనసుని సానుకూల ఆలోచనల దిశగా మళ్లిస్తాయి.
కడుపులో తిప్పుతూ వికారంగా అనిపిస్తున్నప్పుడు మనకి ఏ పనీ చేయాలని అనిపించదు. అటువంటప్పుడు అల్లం టీ తాగితే తక్షణం ఉపశమిస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తుంటే... పుదీనా ఆకులతో చేసిన టీ పొట్టను తేలిక చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







