'డిజిటల్‌'పై సైబర్‌ నేరగాళ్ల కన్ను..

- December 25, 2016 , by Maagulf
'డిజిటల్‌'పై సైబర్‌ నేరగాళ్ల కన్ను..

దేశ ఆర్థిక వ్యవస్థ నగదు రూపంలో నుంచి క్రమంగా డిజిటల్‌ రూపంలోకి మారుతోంది. దీన్ని అనుకూలంగా మలుచుకు నేందుకు సైబర్‌ నేరగాళ్లు కూడా డిజిటల్‌ వ్యవస్థను కొల్లగొట్టేందుకు మాటేశారు. పెద్ద నోట్ల రద్దు, ఇతర కారణాల వల్ల దేశంలో చాలా మంది తొలిసారి ప్లాస్టిక్‌ కరెన్సీ (బ్యాంకు కార్డులతో) లావాదేవీలు జరుపుతున్నారు. బాగా చదువుకున్న వారు కూడా డిజిటల్‌ లావాదేవీల్లో పొరపాట్లు చేస్తున్న నేపథ్యంలో నిరక్షరాస్యులు సులభంగా నష్టపోయే అవకాశముంది. ఐరాస లెక్కల ప్రకారం.. 28.7 కోట్ల మంది నిరక్షరాస్య వయోజనులున్న భారత్‌లో నగదు రహిత లావాదేవీలు ఎలా సాధ్యమన్న ప్రశ్న పుట్టుకొస్తోంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com