దుబాయిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారతీయ బాలుడు మృతి..

- December 26, 2016 , by Maagulf
దుబాయిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారతీయ బాలుడు మృతి..

దుబాయిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల వయస్సున్న భారతీయ బాలుడు మృతి చెందాడు. దుబాయ్‌లోని ముర్షీద్ బజార్‌లో యాలా మొహిస్తిసామ్ అనే బాలుడు సైకిల్‌పై వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. బాలుడిని ఢీకొట్టిన డ్రైవర్ కూడా భారతీయుడే కావడం గమనార్హం. డ్రైవర్ ఖంగారులో కారును మరోమారు వెనక్కు తీసుకురావడంతో అది బాలుడిపైకి మళ్లీ ఎక్కింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. బాలుడి కుటుంబం కొన్నేళ్ల కిందటే దుబాయికి స్థిరపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com