ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం..
- December 26, 2016
పేద ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా పలు రకాల వైద్య సేవలు అందించాలన్న దృక్పథంతో ఈనెల 27 ఉదయం 9 గంటలకు తుళ్లూరులోని శ్రీ రావెల వెంకట సుబ్బారావు మరియు నాగ శేషగిరిరావు జూనియర్, డిగ్రీ కళాశాలలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (AP NRT) నిర్ణయించింది. పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మందులు పంపిణీ చేయనున్నారు. అంతేగాక ఈ మెగా హెల్త్ క్యాంపులో వైద్య సేవలు అందించేందుకు గుంటూరు, విజయవాడ నుంచే కాకుండా అబ్రాడ్ నుండి నిపుణులైన వైద్య బృందం రానుందని పేర్కొంది. తుళ్లూరు మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఏపీ ఎన్ ఆర్ టీ కోరింది.
ఏపీ ఎన్ఆర్టీ నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగూస్ అధ్యక్షుడు డాక్టర్ రవి కుమార్ వేమూరు, తాడికొండ ఎమ్మెల్యే టి.శ్రవణ్ కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఏపీ విద్యావిధాన పరిషత్ కమిషనర్ డా. దుర్గాప్రసాద్ లు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







