త్వరలో మెట్రో రైలు పరుగులు విజయవాడ లో..
- December 27, 2016
విజయవాడ మెట్రో రైల్ విషయంలో ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. తాజాగా వచ్చే ఐదేళ్లకు అవసరమైన నిధులను లోన్ల రూపంలో తీసుకునేందుకు లభించింది. విజయవాడ లో త్వరలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తయ్యేలోగా... మెట్రో రైలు మొదటి దశ పూర్తి చేయాలని ప్రభుత్వం ధృడసంకల్పంతో ఉంది.2018 కల్లా తొలి దశ పూర్తి చేయడం టార్గెట్గా పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. రెండు కారిడార్లకు సంబంధించి DMRC ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు సమకూరస్తుండగా.. రాష్ట్రప్రభుత్వం 20 శాతం నిధులు భరించాల్సి ఉంది. తాజాగా ఏపీ సర్కార్ వాటాపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. వచ్చే ఐదేళ్లకు మొత్తం 2వేల159 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.ఇప్పటికే 300 కోట్లు విడుదల చేసినందున ఇంకా 18వందల 59 కోట్లు అవసరం అని లెక్క వేసింది.ఈ మొత్తాన్ని హాడ్కో లేదా ఇతర బ్యాంకుల నుంచి మూడేళ్ళలో చెల్లించేలా ఋణం తీసుకునేందుకు అమరావతి మెట్రో కార్పొరేషన్ కు అనుమతినిచ్చింది. ఈ రుణానికి ప్రభుత్వం గారంటీ ఇచ్చింది. రాష్ట్ర నిధులపై క్లారిటీ రావడంతో త్వరలోనే కేంద్ర నిధులపైనా స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే గతంలో జైకా వంటి సంస్థలతో రుణాల కోసం ప్రయత్నం చేసినా...నిబంధనలు అడ్డుపడటంతో హాడ్కో నిధులతో మెట్రో పనులు వేగం కానున్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







