సైనిక వీరులకు వందనం : బహ్రెయిన్
- September 08, 2015
విధినిర్వహణలో అసువులు బాసిన తమ 5 గురు సైనికులకు బహ్రైన్ మంత్రిమండలి నివాళులర్పించింది. రాజ్యం, ఈ వీరుల యొక్క త్యాగాన్ని శాశ్వతంగా గుర్తుంచుకుంటుందని, వారి వీరత్వం బహ్రైన్ చరిత్రలో చెక్కబడుతుందని ప్రకటించింది. ప్రధానమంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా అధ్యక్షతన గుడైబీయా రాజభవనంలో జరిగిన సమావేశంలో, అరబ్ ప్రాంతాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, భయాందోళనలను, అస్థిరత్వాన్ని వ్యాప్తింపచేయాలనుకొనే తీవ్రవాదానికి అరబ్ కూటమి లోని దేశాలు అడ్డుకట్ట వేస్తాయని స్పష్టం చేశారు. ఇంకా ఈ సమావేశంలో షరీయా ఆధారిత న్యాయస్థానం కుటుంబ సమస్యలను పరిష్కరించే విధంగా, అంటే అటువంటి వివాదాలు మొదట 10 రోజులలో ఫామిలీ రేకన్సిలేషన్ ఆఫీస్ వద్ద, స్నేహపూర్వక పరిష్కారానికి వచ్చేలా, ఆవిధంగా పరిష్కరించబడనపుడు మాత్రమే న్యాయస్థానం ముందుకు వచ్చేలా ముఖ్య సవరణలను ఆమోదించింది.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







