సైనిక వీరులకు వందనం : బహ్రెయిన్

- September 08, 2015 , by Maagulf
సైనిక  వీరులకు వందనం : బహ్రెయిన్

విధినిర్వహణలో అసువులు బాసిన తమ 5 గురు  సైనికులకు బహ్రైన్ మంత్రిమండలి నివాళులర్పించింది. రాజ్యం, ఈ వీరుల యొక్క త్యాగాన్ని శాశ్వతంగా గుర్తుంచుకుంటుందని, వారి వీరత్వం బహ్రైన్ చరిత్రలో చెక్కబడుతుందని ప్రకటించింది. ప్రధానమంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా అధ్యక్షతన గుడైబీయా రాజభవనంలో జరిగిన సమావేశంలో, అరబ్ ప్రాంతాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, భయాందోళనలను, అస్థిరత్వాన్ని వ్యాప్తింపచేయాలనుకొనే తీవ్రవాదానికి అరబ్ కూటమి లోని దేశాలు అడ్డుకట్ట వేస్తాయని స్పష్టం చేశారు. ఇంకా ఈ సమావేశంలో షరీయా ఆధారిత న్యాయస్థానం కుటుంబ సమస్యలను పరిష్కరించే విధంగా, అంటే అటువంటి వివాదాలు మొదట 10 రోజులలో ఫామిలీ రేకన్సిలేషన్ ఆఫీస్ వద్ద, స్నేహపూర్వక పరిష్కారానికి వచ్చేలా, ఆవిధంగా పరిష్కరించబడనపుడు మాత్రమే న్యాయస్థానం ముందుకు వచ్చేలా ముఖ్య సవరణలను ఆమోదించింది.

 

--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com