దుబాయ్‌ టాక్సీల్లో డు వైఫై, స్మార్ట్‌ స్క్రీన్‌ ..

- December 29, 2016 , by Maagulf
దుబాయ్‌ టాక్సీల్లో డు వైఫై, స్మార్ట్‌ స్క్రీన్‌ ..

దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన్‌, రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీతో కలిసి 'డు' సంస్థ యూఏఈ వ్యాప్తంగా 500 ట్యాక్సీల్లో వైఫై మరియు, స్మార్ట్‌ స్క్రీన్‌లను అందుబాటులోకి తెస్తోంది. అయితే ఇవి దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌కి చెందిన ట్యాక్సీలు కావడం గమనించదగ్గది. దుబాయ్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా తమవంతుగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నట్లు 'డు' నిర్వాహకులు తెలిపారు. స్మార్ట్‌ స్క్రీన్స్‌లో ప్రమోషనల్‌ అడ్వర్‌టైజ్‌మెంట్స్‌, ఆర్‌టిఎ సర్వీసులు, అలాగే దుబాయ్‌కి చెందిన ప్రముఖ టూరిస్ట్‌ డెస్టినేషన్ల గురించి ప్రయాణీకులకు తెలిపేలా సమాచారం అందుబాటులో ఉంటుందని డు సంస్థ ప్రకటించింది. వైఫై యుఎఇ అనే దేశవ్యాప్త ఇనీషియేటివ్‌ని డు సంస్థ ప్రతిస్టాత్మకంగా తీసుకుందనీ, తద్వారా వైఫైని పబ్లిక్‌ తేలిగ్గా, అన్నిచోట్లా పొందేందుకు కృషి చేస్తున్నామని, యూఏఈ 2021 విజన్‌లో ఇదీ ఓ భాగమని ఆ సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. మలేషియన్‌ ఐసిటి సొల్యూషన్స్‌ డెవలపర్‌ గిగాలింక్‌ సొల్యూషన్స్‌ ద్వారా దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ టాక్సీలకు స్మార్ట్‌ స్క్రీన్స్‌ని అందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com