దుబాయ్ టాక్సీల్లో డు వైఫై, స్మార్ట్ స్క్రీన్ ..
- December 29, 2016
దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీతో కలిసి 'డు' సంస్థ యూఏఈ వ్యాప్తంగా 500 ట్యాక్సీల్లో వైఫై మరియు, స్మార్ట్ స్క్రీన్లను అందుబాటులోకి తెస్తోంది. అయితే ఇవి దుబాయ్ ఎయిర్పోర్ట్కి చెందిన ట్యాక్సీలు కావడం గమనించదగ్గది. దుబాయ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తమవంతుగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నట్లు 'డు' నిర్వాహకులు తెలిపారు. స్మార్ట్ స్క్రీన్స్లో ప్రమోషనల్ అడ్వర్టైజ్మెంట్స్, ఆర్టిఎ సర్వీసులు, అలాగే దుబాయ్కి చెందిన ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్ల గురించి ప్రయాణీకులకు తెలిపేలా సమాచారం అందుబాటులో ఉంటుందని డు సంస్థ ప్రకటించింది. వైఫై యుఎఇ అనే దేశవ్యాప్త ఇనీషియేటివ్ని డు సంస్థ ప్రతిస్టాత్మకంగా తీసుకుందనీ, తద్వారా వైఫైని పబ్లిక్ తేలిగ్గా, అన్నిచోట్లా పొందేందుకు కృషి చేస్తున్నామని, యూఏఈ 2021 విజన్లో ఇదీ ఓ భాగమని ఆ సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. మలేషియన్ ఐసిటి సొల్యూషన్స్ డెవలపర్ గిగాలింక్ సొల్యూషన్స్ ద్వారా దుబాయ్ ఎయిర్పోర్ట్ టాక్సీలకు స్మార్ట్ స్క్రీన్స్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







