నన్ను తిడతారని ముందుగానే ఫిక్సయ్యా: మారుతి!
- January 03, 2017
'ఈరోజుల్లో', 'బస్టాప్' వంటి బ్యాక్ టు బ్యాక్ అడల్డ్ కంటెంట్ సినిమాలతో ఓవర్నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు మారుతి. ఆ రెండు సినిమాలు ఎంతటి విజయాలను సాధించాయో, అంతే వివాదాలను కూడా సృష్టించాయి. తాజాగా ఆ సినిమాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు మారుతి. ''నిజానికి 'ఈరోజుల్లో' కంటే ముందు నేను తీసినది 'బస్టాప్' సినిమాయే. అయితే డబ్బుల్లేకపోవడంతో 'బస్టాప్' సినిమా సగం వరకు షూటింగ్ చేసి ఆపేశాం. దాంతో ఏం చేయాలో తెలియక రామ్గోపాల్ వర్మగారి స్ఫూర్తితో 5డి కెమెరాతో 'ఈ రోజుల్లో' మొదలుపెట్టాం. స్నేహితులను, తెలిసిన వారిని డబ్బులడిగి కేవలం 15 లక్ష ల రూపాయలతో ఆ సినిమా చేశాం.
కానీ, విడుదలకు ముందు చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతో శ్రీనగర్కాలనీలో రోడ్డు పక్కనే కార్ ఆపి కన్నీళ్లు పెట్టుకున్నా.
అయితే ఊహించని విధంగా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ముందుగా సగం వరకు చేసి ఆపేసిన 'బస్టాప్'ను మొదలుపెట్టా. ఆ సినిమాలో ఉన్న అడల్ట్ కంటెంట్ చూసి అందరూ నన్ను తిడతారని ముందుగానే ఫిక్సయ్యా. అనుకున్నట్టుగానే ఆ సినిమా విమర్శలను, డబ్బులను కూడా తీసుకొచ్చింది. ఇక మూడో సినిమా 'ప్రేమకథా చిత్రమ్' సినిమాలో ప్రతీ షాట్ నేనే తీశా. కానీ, దెయ్యంతో కామెడీ అంటే ఎవరూ చూడరని భయం వేసి నా పేరు వేసుకోలేదు. ఆ సినిమాకు పని చేసిన కెమెరామెన్ పేరును డైరెక్టర్ పేరుగా వేశాం.'' అని చెప్పాడు మారుతి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







