కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- January 02, 2026
కువైట్: 2024–2025 మధ్య క్లీనప్ డ్రైవ్ లో భాగంగా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 73,700 పనిచేయని కంపెనీలను వాణిజ్య రిజిస్టర్ నుండి తొలగించింది.తొలగించిన కంపెనీలు గతంలో రిజిస్టర్లో జాబితాలోని మొత్తం 2,10,000 కంపెనీలలో దాదాపు 35 శాతానికి సమానం. అదే విధంగా అధికారుల తనిఖీ సందర్భంగా 589 మొబైల్ వాహనాల లైసెన్స్లు రద్దు చేశారు. తొలగించిన కంపెనీలు కేవలం పేపర్లకే పరిమితం అయ్యాయని పేర్కంది. కువైట్ అంతర్జాతీయ ర్యాంకింగ్లను మెరుగుపరిచేందుకు, మనీలాండరింగ్ నిరోధక మరియు ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్ వ్యవస్థలను బలోపేతం చేస్తుందని, అదే సమయంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుందని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు, 2025 మొదటి తొమ్మిది నెలల్లో దాదాపు 32,710 కొత్త వాణిజ్య లైసెన్సులు జారీ చేసినట్లు తెలిపింది. వీటితో కలిపి వాణిజ్య రిజిస్టర్లో మొత్తం చెల్లుబాటు అయ్యే లైసెన్సుల మొత్తం సంఖ్య 3,20,000 గా ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









