కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- January 02, 2026
కువైట్: 2024–2025 మధ్య క్లీనప్ డ్రైవ్ లో భాగంగా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 73,700 పనిచేయని కంపెనీలను వాణిజ్య రిజిస్టర్ నుండి తొలగించింది.తొలగించిన కంపెనీలు గతంలో రిజిస్టర్లో జాబితాలోని మొత్తం 2,10,000 కంపెనీలలో దాదాపు 35 శాతానికి సమానం. అదే విధంగా అధికారుల తనిఖీ సందర్భంగా 589 మొబైల్ వాహనాల లైసెన్స్లు రద్దు చేశారు. తొలగించిన కంపెనీలు కేవలం పేపర్లకే పరిమితం అయ్యాయని పేర్కంది. కువైట్ అంతర్జాతీయ ర్యాంకింగ్లను మెరుగుపరిచేందుకు, మనీలాండరింగ్ నిరోధక మరియు ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్ వ్యవస్థలను బలోపేతం చేస్తుందని, అదే సమయంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుందని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు, 2025 మొదటి తొమ్మిది నెలల్లో దాదాపు 32,710 కొత్త వాణిజ్య లైసెన్సులు జారీ చేసినట్లు తెలిపింది. వీటితో కలిపి వాణిజ్య రిజిస్టర్లో మొత్తం చెల్లుబాటు అయ్యే లైసెన్సుల మొత్తం సంఖ్య 3,20,000 గా ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







