కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- January 02, 2026
కువైట్: 2024–2025 మధ్య క్లీనప్ డ్రైవ్ లో భాగంగా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 73,700 పనిచేయని కంపెనీలను వాణిజ్య రిజిస్టర్ నుండి తొలగించింది.తొలగించిన కంపెనీలు గతంలో రిజిస్టర్లో జాబితాలోని మొత్తం 2,10,000 కంపెనీలలో దాదాపు 35 శాతానికి సమానం. అదే విధంగా అధికారుల తనిఖీ సందర్భంగా 589 మొబైల్ వాహనాల లైసెన్స్లు రద్దు చేశారు. తొలగించిన కంపెనీలు కేవలం పేపర్లకే పరిమితం అయ్యాయని పేర్కంది. కువైట్ అంతర్జాతీయ ర్యాంకింగ్లను మెరుగుపరిచేందుకు, మనీలాండరింగ్ నిరోధక మరియు ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్ వ్యవస్థలను బలోపేతం చేస్తుందని, అదే సమయంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుందని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు, 2025 మొదటి తొమ్మిది నెలల్లో దాదాపు 32,710 కొత్త వాణిజ్య లైసెన్సులు జారీ చేసినట్లు తెలిపింది. వీటితో కలిపి వాణిజ్య రిజిస్టర్లో మొత్తం చెల్లుబాటు అయ్యే లైసెన్సుల మొత్తం సంఖ్య 3,20,000 గా ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









