కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- January 02, 2026
కువైట్: 2024–2025 మధ్య క్లీనప్ డ్రైవ్ లో భాగంగా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 73,700 పనిచేయని కంపెనీలను వాణిజ్య రిజిస్టర్ నుండి తొలగించింది.తొలగించిన కంపెనీలు గతంలో రిజిస్టర్లో జాబితాలోని మొత్తం 2,10,000 కంపెనీలలో దాదాపు 35 శాతానికి సమానం. అదే విధంగా అధికారుల తనిఖీ సందర్భంగా 589 మొబైల్ వాహనాల లైసెన్స్లు రద్దు చేశారు. తొలగించిన కంపెనీలు కేవలం పేపర్లకే పరిమితం అయ్యాయని పేర్కంది. కువైట్ అంతర్జాతీయ ర్యాంకింగ్లను మెరుగుపరిచేందుకు, మనీలాండరింగ్ నిరోధక మరియు ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్ వ్యవస్థలను బలోపేతం చేస్తుందని, అదే సమయంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుందని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు, 2025 మొదటి తొమ్మిది నెలల్లో దాదాపు 32,710 కొత్త వాణిజ్య లైసెన్సులు జారీ చేసినట్లు తెలిపింది. వీటితో కలిపి వాణిజ్య రిజిస్టర్లో మొత్తం చెల్లుబాటు అయ్యే లైసెన్సుల మొత్తం సంఖ్య 3,20,000 గా ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్







