దుబాయ్ నివాసి జయ నరసింహరావు గారికి 'దుబాయ్ ఘంటసాల' బిరుదుప్రదానం
- September 10, 2015
దుబాయ్ నగరంలో తెలుగు వారైన జయ నరసింహ రావు గారు, స్థానిక గాయకులు మరియు గత సంవత్సరం మే నెలలో స్థాపించబడిన మ్యూజిక్ లవర్స్ ఫాక్టరీ (MLF) యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు.
వీరు దుబాయ్ నగరంలో హిందీ మరియు తెలుగు భాషలలో అనేక విజయవంతమైన సంగీత కార్యక్రమాలను చేసియున్నారు. వారి సంస్థ త్వరలోనే అంటే నవంబరులో వార్షికోత్సవం జరుపుకోనుంది.
గతనెల, హైదరాబాదు త్యాగరాయ గానసభా హాలులో, డా. శరత్ చంద్ర గారి ఆధ్వర్యంలో జరిగిన "పాట విందు-పద్యం పసందు" కార్యక్రమంలో తెలుగు సినిమాకే మాస్టారు ఐన ఘంటసాల గారి గాత్రాన్నిఅనుకరిస్తూ పాడిన పాటలకు మెచ్చి, డా. సి. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఈయనకు, 'దుబాయ్ ఘంటసాల' బిరుదునిచ్చి గౌరవించారు. శ్రీ రావు గారు ఆలపించిన గీతాలకు పరవ శలైన ఆహూతులు, దుబాయ్ ఘంటసాల అనే బిరుదు సార్ధకమైనదని అభిప్రాయపడుతూ, ఘంటసాల వారి పాటలను దుబాయిలో వినిపించి, వ్యాప్తి చేస్తున్నందుకు ఆయనను మనసారా అభినందించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







