దుబాయ్ నివాసి జయ నరసింహరావు గారికి 'దుబాయ్ ఘంటసాల' బిరుదుప్రదానం
- September 10, 2015
దుబాయ్ నగరంలో తెలుగు వారైన జయ నరసింహ రావు గారు, స్థానిక గాయకులు మరియు గత సంవత్సరం మే నెలలో స్థాపించబడిన మ్యూజిక్ లవర్స్ ఫాక్టరీ (MLF) యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు.
వీరు దుబాయ్ నగరంలో హిందీ మరియు తెలుగు భాషలలో అనేక విజయవంతమైన సంగీత కార్యక్రమాలను చేసియున్నారు. వారి సంస్థ త్వరలోనే అంటే నవంబరులో వార్షికోత్సవం జరుపుకోనుంది.
గతనెల, హైదరాబాదు త్యాగరాయ గానసభా హాలులో, డా. శరత్ చంద్ర గారి ఆధ్వర్యంలో జరిగిన "పాట విందు-పద్యం పసందు" కార్యక్రమంలో తెలుగు సినిమాకే మాస్టారు ఐన ఘంటసాల గారి గాత్రాన్నిఅనుకరిస్తూ పాడిన పాటలకు మెచ్చి, డా. సి. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఈయనకు, 'దుబాయ్ ఘంటసాల' బిరుదునిచ్చి గౌరవించారు. శ్రీ రావు గారు ఆలపించిన గీతాలకు పరవ శలైన ఆహూతులు, దుబాయ్ ఘంటసాల అనే బిరుదు సార్ధకమైనదని అభిప్రాయపడుతూ, ఘంటసాల వారి పాటలను దుబాయిలో వినిపించి, వ్యాప్తి చేస్తున్నందుకు ఆయనను మనసారా అభినందించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







