తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులకు చల్లని కబురు
- September 10, 2015
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.14 శాతం డిఎను పెంచాలని నిర్ణయం తీసుకొంది కేసీఆర్ సర్కారు.ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజనాపై ప్రతి ఏటా సుమారు 300 కోట్ల అదనపు భారం పడనుంది.ప్రస్తుతం 8.908శాతం డిఎను ఇస్తున్నారు.దీన్ని 12.052 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వల్ల మూడున్నర లక్షల మందికి ప్రయోజనం కలుగుతోంది.పెంచిన డిఎను ఈ ఏడాది సెప్టెంబర్ నుండి వేతనాలతో కలిపి ఇవ్వనున్నారు. పెంచిన డిఎను ఈ ఏడాది జనవరి 1వ, తేది నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ ఏడాది జనవరి నుండి ఆగష్టు వరకు బకాయిలను ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాల్లో జమచేయనుంది ప్రభుత్వం.ఒకవేళ జిపిఎఫ్ ఖాతాలు లేని ఉద్యోగుల బకాయిలను..స్టేట్ ప్రావిడెంట్ ఫండ్..జనరల్ ఫ్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే పార్ట్ టైం అసిస్టెంట్లు, వీఆర్ ఏ లకు నెలకు వంద రూపాయల వేతనం పెంచుతున్నట్టు ఉత్తర్వ్యులో పేర్కొంది సర్కారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







