ఫిజీ దేశంలో 7.9 తీవ్రతతో భూకంపం..

- January 03, 2017 , by Maagulf
ఫిజీ దేశంలో 7.9  తీవ్రతతో భూకంపం..

ఫిజీ దేశంలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై 7.9 తీవ్రతతో భూమి కంపించింది. సుమారు 10-15 నిమిషాలపాటు భూమి కంపించినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో పసిఫిక్ సునామీ కేంద్ర అధికారులు మొదట సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
శక్తివంతమైన భూకంపం ఫిజీ రాజధాని సువాను తాకింది. మొదట7.2 తీవ్రతతో తో రికార్డ్ చేయబడింది. కానీ 6.9 కు తగ్గించబడింది. దీంతో మొదట జారీ చేసిన సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. అయితే సముద్ర సమీపంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
భూప్రకంపనలు మొదలుకావడంతో జనం ఒక్కసారిగా ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటికి పరుగులు తీశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

అధికారుల సహాయక చర్యలు చేపట్టారు. తీర ప్రాంత వాసులును సురక్షి ప్రాంతాలకు తరలిస్తున్నారు భూకంపం కారణంగా ఏమేర నష్టం సంభవించిందన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com