యూ.ఏ.ఈ. లో నేడు ఇసుక దుమారం- వర్షం పడే అవకాశం
- September 10, 2015
ద నేషనల్ సెంటర్ ఫర్ మెటిరోలజీ అండ్ సేస్మోలజీ (NCMS) వారు నేడు ఇసుకదుమారం సంభవించే అవకాశాలు ఉన్నందున మోటరు వాహనదారులను జాగ్రత్త వహించాలని, వేగాన్నీ తగ్గించాలని, వాహనాల మధ్య తగిన దూరాన్ని పాటించాలని ప్రకటించారు. శాఖ వారు దట్టమైన క్యుములస్ మేఘాలు కమ్ముకుంటాయని, వాటివలన వర్షాలు, ఈదురుగాలులు కొన్ని తూర్పు ప్రాంతాలలో సంభవించే అవకాశముందని విశ్లేషించారు. ఇక ఈ మంగళవారం, మధ్య ప్రాచ్య దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఇసుకదుమరం రేగటo వలన, లెబనాన్ లో ఇద్దరు మృతి చెందగా, వందలమంది ఆసుపత్రుల పాలయ్యారు. ఈ ధూళిమేఘాలు జోర్డాన్, ఇజ్రాయెల్ మరియు సైప్రస్ లను కూడా చుట్టుముట్టి, దృష్టి పధం 500 మీటర్లకు పడిపోవడం వలన,పలు విమానాలు లార్నకా నుండి పాఫోస్ కు తరలించబడ్డాయి. గతంలోకూడా ఇసుకదుమారాలు రేగినప్పటికీ ఇంత తీవ్రంగా లేవని, సంవత్సరంలోని ఈ సమయంలో, అదికూడా ఇంత తీవ్రంగా ప్రాంతాన్నంతటినీ చుట్టుముట్తడం చాలా అరుదు అని, సైప్రియొత్ వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







