యూ.ఏ.ఈ. లో నేడు ఇసుక దుమారం- వర్షం పడే అవకాశం
- September 10, 2015
ద నేషనల్ సెంటర్ ఫర్ మెటిరోలజీ అండ్ సేస్మోలజీ (NCMS) వారు నేడు ఇసుకదుమారం సంభవించే అవకాశాలు ఉన్నందున మోటరు వాహనదారులను జాగ్రత్త వహించాలని, వేగాన్నీ తగ్గించాలని, వాహనాల మధ్య తగిన దూరాన్ని పాటించాలని ప్రకటించారు. శాఖ వారు దట్టమైన క్యుములస్ మేఘాలు కమ్ముకుంటాయని, వాటివలన వర్షాలు, ఈదురుగాలులు కొన్ని తూర్పు ప్రాంతాలలో సంభవించే అవకాశముందని విశ్లేషించారు. ఇక ఈ మంగళవారం, మధ్య ప్రాచ్య దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఇసుకదుమరం రేగటo వలన, లెబనాన్ లో ఇద్దరు మృతి చెందగా, వందలమంది ఆసుపత్రుల పాలయ్యారు. ఈ ధూళిమేఘాలు జోర్డాన్, ఇజ్రాయెల్ మరియు సైప్రస్ లను కూడా చుట్టుముట్టి, దృష్టి పధం 500 మీటర్లకు పడిపోవడం వలన,పలు విమానాలు లార్నకా నుండి పాఫోస్ కు తరలించబడ్డాయి. గతంలోకూడా ఇసుకదుమారాలు రేగినప్పటికీ ఇంత తీవ్రంగా లేవని, సంవత్సరంలోని ఈ సమయంలో, అదికూడా ఇంత తీవ్రంగా ప్రాంతాన్నంతటినీ చుట్టుముట్తడం చాలా అరుదు అని, సైప్రియొత్ వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







